June 8, 2025
తాజా వార్తలు

షుగర్ వ్యాధిని నియంత్రిద్దాం

ప్రజాశక్తి- తాడేపల్లిగూడెం

మధుమేహాన్ని ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమతో కొట్టాలని, షుగర్ వ్యాధిని ఆదిలోనే నియంత్రించాలని జిల్లా జిఎంఏ కోఆర్డినేటర్ పేరిచర్ల ఫౌండేషన్ చైర్మన్ లయన్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్ అండ్ బి గ్రౌండ్స్ లో పేరిచర్ల ఫౌండేషన్ సహకారంతో తాడేపల్లిగూడెం డైమండ్స్ ఆధ్వర్యంలో ప్రతినెలా జరుగుతున్న ఉచిత మధుమేహ పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నడక, యోగ, ఆటలతో పాటు మానసిక ప్రశాంతత కోసం పర్యావరణ, పరిరక్షణ, నాటడం, పరిసరాల పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి సభ్యులు డైమండ్స్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video