ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ శుభవార్తలే అందుతున్నాయి. ఇప్పటికే దశాబ్దాలుగా పేరుకుపోయిన పలు సమస్యల పరిష్కారంతో పాటు విభజన హామీల్ని కూడా అమలు చేస్తున్న కేంద్రం.. తాజాగా ఇదే క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రైల్వే శాఖ చేపడుతున్న పనుల్లో భాగంగా ఏపీలోనూ దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఓ ప్రధాన సమస్యకు పరిష్కారం చూపించేందుకు సిద్దమైంది. ఈ మేరకు క్షేత్రస్దాయిలో అధికారులు రంగంలోకి దిగారు.
రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాలతో పాటు చిన్న చిన్న గ్రామాలకు సైతం దశాబ్దాలుగా రైల్వే గేట్లు, లెవెల్ క్రాసింగ్స్ సమస్య ఉంది. వీటి వల్ల రైల్వేకు ఎన్నో ఏళ్లుగా అదనంగా సిబ్బంది కేటాయింపులతో పాటు స్థానికంగా వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైల్వేశాఖ చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా ఇలాంటి రైల్వే గేట్లను తొలగించి వాటి స్ధానంలో వంతెనలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు బడ్జెట్ కేటాయింపులు కూడా చేశారు.
Leave feedback about this