June 8, 2025
జాతీయ వార్తలు

New Fastag Rules: అమల్లోకి వచ్చిన ఫాస్టాగ్ కొత్త రూల్స్-తేడా వస్తే షాకులే..!

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల కష్టాల్ని తప్పించేందుకు జాతీయ చెల్లింపుల కార్పోరేషన్ ఇవాళ్టి నుంచి కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాహనదారులు తమ వాహనాలకు చేసే ఫాస్టాగ్ రీఛార్జ్ ల విషయంలో కీలక మార్పులు చేసింది. అయితే వీటిపై వాహనదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల పేరుతో జరుగుతున్న దోపిడీకి ఇది కొనసాగింపేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.

తాజా నిబంధనల ప్రకారం దేశంలో ఇకపై బ్లాక్‌లిస్ట్ చేసిన ఫాస్ట్‌ట్యాగ్‌లపై లావాదేవీల్ని అనుమతించరు. ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్ చేసి ఉంటే టోల్ ప్లాజాకు చేరుకోవడానికి 60 నిమిషాల కంటే ముందు తక్కువ బ్యాలెన్స్‌గా మార్క్ చేయబడితే సదరు లావాదేవీ ని తిరస్కరిస్తారు. స్కాన్ చేసిన తర్వాత 10 నిమిషాల పాటు ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే చెల్లింపు కూడా తిరస్కరిస్తారు. ఈ రెండు షరతులు ఉల్లంఘిస్తే సిస్టమ్ ఎర్రర్ కోడ్ 176తో లావాదేవీని తిరస్కరిస్తుంది, అలాగే వాహనానికి పెనాల్టీగా టోల్ రుసుము కంటే రెట్టింపు వసూలు చేస్తారు.

ఫాస్టాగ్ తాజా రూల్స్ ప్రకారం ఇకపై చివరి నిమిషంలో రీఛార్జ్‌లు ఉండవు. టోల్ ప్లాజా‌ను చేరుకోవడానికి ముందు 60 నిమిషాల కంటే ఎక్కువ ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్ చేయబడి ఉంటే, చివరి క్షణంలో రీఛార్జ్ జరగదు. పెనాల్టీ రీఫండ్ మాత్రం ఇకపై సాధ్యమవుతుంది. స్కానింగ్ చేసిన 10 నిమిషాల లోపు రీఛార్జ్ చేస్తే వినియోగదారులు రిఫండ్ కోరవచ్చు. అలాగే రెట్టింపు టోల్ ఛార్జీలను చెల్లించకుండా నివారించవచ్చు.టోల్ బూత్‌లలో ఆలస్యం, అదనపు ఛార్జీలు లేదా తిరస్కరణను నివారించడానికి వినియోగదారులు తమ ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video