ఏపీలో మహాశివరాత్రి వేళ మరో అద్బుతం ఆవిష్కృతం కానుంది. ఆంధ్ర శబరిమలుగా పేరొందిన తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయంలో మహాశివరాత్రి నాడు 60 అడుగు ల ఆదియోగి (జ్ఞానయోగి) విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహం దేశంలోనే మూడో అతి పెద్దదిగా రికార్డు నెలకొల్పుతోంది. మహాశివరాత్రి నాడు ఆవిష్కరణ కానున్న ఈ విగ్రహ ఏర్పాటు లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ అరుదైన ఘట్టానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఏపీలో అత్యంత పెద్ద దైన ఆదియోగి విగ్రహ నిర్మాణం పూర్తి అయింది. మహా శివరాత్రి పండగ సందర్భంగా ఈ ఆదియోగి విగ్రహాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యా యి. ఇప్పటి వరకు బెంగళూరు, తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూరులో 112 అడుగుల ఎత్తయిన ఆదియోగి విగ్రహాలు ఉన్నాయి. కాగా, ఇప్పుడు దేశంలోనూ మూడో అతి పెద్ద ఆదియోగి విగ్రహం ఇక్కడ ఏర్పాటైంది. ద్వారపూడి అయ్యప్ప దేవాలయంలో 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో మూడో అతిపెద్ద విగ్రహం రూపుదిద్దుకుంది. మహాశివరాత్రి నాడు ఉదయం ఈ విగ్రహం ఆవిష్కరించనున్నారు.
భక్తి
ఆంధ్ర శబరిమలలో ఆదియోగి, అరుదైన ఘట్టం – ఎన్నో ప్రత్యేకతలు..!!
- by kowru Lavanya
- February 24, 2025
- 0 Comments
- Less than a minute
- 58 Views
- 10 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this