AP: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాండ్రేగులలో ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీ స్వామి వివేకానంద స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది పిల్లలకు గాయాలయ్యాయి. వారిని జగ్గంపేట సీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Leave feedback about this