June 8, 2025
తాజా వార్తలు

చేతికి సెలైన్ తో హాస్పిటల్ బెడ్ పై స్టార్ హీరోయిన్…

స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ అనారోగ్యం బారిన పడిందా అనే అనుమానం ఆమె ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. పలు చిత్రాల్లో నటిస్తూనే.. నిర్మాతగా మారిన సామ్‌ ‘ట్రలాలా’ పేరుతో ప్రొడక్షన్‌ హౌజ్‌ను ప్రారంభించింది. ఈ బ్యానర్‌పై తెరకెక్కించిన తొలి చిత్రం ‘శుభం’ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు కూడా రిలీజ్ అయ్యింది ఈ మూవీ. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్‌ చేసింది సామ్. అందులో సామ్‌ హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఫోటో కూడా ఉంది. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

దాదాపు 16 ఫోటోలు షేర్‌ చేస్తూ వాటికి క్యాప్షన్‌ ఇస్తూ తన జర్నీని వివరించింది సమంత. ఆ పోస్టులో ఆమె చిల్‌ అవుతూ, పాడ్‌ కాస్ట్‌లో మాట్లాడుతూ, మరికొన్ని అలా సరదగా బయటకు వెళ్లిన ఫోటోలు పోస్ట్ చేసింది. అలాగే తాను అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఫోటోని కూడా షేర్‌ చేసింది. ఇందులో సామ్‌ బెడ్‌పై పడుకుని చేతికి సెలైన్‌ ఎక్కించుకుంటూ కనిపించింది. దీంతో సామ్‌కు మళ్లీ ఏమైంది అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అయితే సామ్‌ ఇంకా పూర్తి కోలుకోలేదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది ఇప్పటి ఫోటో కాదనేది ఆమె ఫోస్ట్‌ చూస్తే స్పష్టం అవుతుంది. శాకుంతలం మూవీ టైంలో ఆమె మోయోసైటిస్‌ అనే వ్యాదితో బాధపడుతున్నట్టు తెలిపింది. అప్పటి నుంచి ఆమె ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటుది. ఖుషి మూవీతో లాంగ్‌ గ్యాప్‌ తీసుకుని విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకుని కోలుకున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య సరసన ‘ఏ మాయ చేసావే’ సినిమాతో సమంత ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది సామ్. తెలుగులో చివరిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటించింది. ఆ తర్వాత సిటాడెల్‌: హనీ బన్నీ అనే యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌లో నటించింది. సమంత ప్రస్తుతం “రక్త బ్రహ్మాండ్” వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అలాగే, “మా ఇంటి బంగారం” అనే సినిమాతో నిర్మాతగా మారి, అందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video