తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్వీ అన్నదానం, ఎస్వీ ప్రాణదానం తరహాలో దేశవ్యాప్తంగా శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాల నిర్మాణాలు చేపడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తిరుమల పద్మావతీ అతిథి గృహంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి జే శ్యామల రావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి విలేకరులతో మాట్లాడారు.దేశంలోని అన్ని రాజధానులలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయాలను నిర్మించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. గ్రామాల్లోని ఆలయాల్లో ప్రతి ఒక్కరూ సేవ చేయాలని సూచించారు. శ్రీవారి సేవను మరింత పకడ్బందీగా అమలు చేసేలా ప్రణాళికలు చేపట్టాలని సూచించారు.
భక్తి
టీటీడీలో శ్రీవెంకటేశ్వర ఆలయాల నిర్మాణ నిధి
- by kowru Lavanya
- March 22, 2025
- 0 Comments
- Less than a minute
- 17 Views
- 3 months ago

Leave feedback about this