గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని యువతకు నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ 2025. ఈ స్కీమ్ ద్వారా పేద, మధ్య తరగతి యువతీయువకులకు తమకు ఆసక్తి ఉన్న రంగంలో ఉచితంగా నైపుణ్యాలు నేర్పిస్తారు. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కూడా అందిస్తారు. అయితే తాజాగా ఈ స్కీమ్ రిజిస్ట్రేషన్ తేదీని మరోసారి పొడిగించారు. ఈ మేరకు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ మొబైల్ యాప్ను కూడా ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థులు తమకు అర్హత, ఆసక్తి ఉన్న విభాగంలో ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని యాప్ ఆవిష్కరణ అనంతరం పేర్కొన్నారు.పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ 2025 లక్ష్యం ఏంటంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల మందికి ఇంటర్నెట్ షిప్ అవకాశాలను కల్పించాలి. అధికశాతం గ్రామీణ ప్రాంతాల్లోని యువతకే ఎక్కువ ఛాన్స్ ఇస్తారు. ఈ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 చివరి తేదిగా ఉంది. ఆసక్తి కలిగిన యువత ఈలోపే అప్లై చేసుకోవడం ఉత్తమం. ఇక ఇంటర్న్ షిప్ సమయంలో పలు కంపెనీలు స్టైఫెండ్ కూడా అందిస్తాయి. అంతేకాక ఇంటర్న్ షిప్ అనంతరం సర్టిఫికేట్ సైతం లభిస్తుంది. ఈ సర్టిఫికెట్ తో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఎడ్యుకేషన్ & కెరీర్
PMIS Internship: యువతకు ప్రతి నెలా రూ.5000 .. ఇప్పుడే అప్లై చేసుకోండి
- by kowru Lavanya
- March 25, 2025
- 0 Comments
- Less than a minute
- 19 Views
- 3 months ago

Leave feedback about this