June 8, 2025
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. నచ్చిన కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా చదువుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం విద్యార్థులకు తీపికబురు చెప్పింది. . వారి కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకురానుంది. ఈ మేరకు ముస్లిం విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌తో పాటుగా JEE, NEET కోచింగ్ ఉచితంగా చదువుకుంటారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ పథకం అమలు చేయనున్నరు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ పథకం వివరాలు ఇలా ఉన్నాయి.రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది పదో తరగతి పాసైన విద్యార్థులకు ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. అందులో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులను ఎంపిక చేసి.. వారికి నచ్చిన కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివే అవకాశం కల్పిస్తారు. వారికి JEE, NEET కోచింగ్ కూడా ఉచితంగా ఇస్తారు.. ఆ ఖర్చు మొత్తాన్ని వక్ఫ్ బోర్డు భరిస్తుంది. దీనికి సంబంధించి కాలేజీల యాజమాన్యాలతో ఇప్పటికే అధికారులు మాట్లాడారు. ఈ పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తారు.. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. ముస్లిం విద్యార్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పాలి.. జస్ట్ ప్రభుత్వం నిర్వహించే టాలెంట్ టెస్ట్‌లో మంచి మార్కులు తెచ్చుకుంటే చాలు.. కార్పొరేటర్ కాలేజీల్లో ఉచితంగా చదువుకునే అవకాశం లభిస్తుంది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video