June 8, 2025
భక్తి

తిరుమల భద్రతా లోపాలపై కేంద్రం ఆరా – ఏం జరుగుతోంది..!!

Tirumala: తిరుమలలో భద్రతా లోపాల పై కేంద్రం ఆరా తీసింది. కొంత కాలంగా చోటు చేసుకుం టున్న వరుస పరిణామాల పైన స్పందించాలని సూచించింది. తిరుమలలో భద్రతా వైఫల్యాల పైన తిరుపతి ఎంపీ గురుమూర్తి కేంద్రానికి ఫిర్యాదు చేసారు. తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. దీంతో స్పందించిన కేంద్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఈ ఫిర్యాదుల పైన పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు. తిరుమలలో భద్రత పైన ఎంపీ చేసిన ఫిర్యాదు..తీసుకుంటున్న చర్యల పైన నివేదిక ఇవ్వాలని అందులో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.తిరుమలలో వరుసగా జరుగుతున్న భద్రత వైఫల్యాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ.. ప్రధానమంత్రి, హోం మంత్రి, హోంశాఖ కార్యదర్శికి వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ”వైకుంఠ ఏకాదశి రోజున ఆరుగురు భక్తులు తొక్కిసలాటలో చనిపోయారు. అన్నదానం క్యూ కాంప్లెక్స్‌లో భక్తులను నియంత్రించలేక తొక్కిసలాట జరిగింది. నాన్ వెజ్ పదార్థాలను కొండ పైకి తీసుకెళ్లి తిన్న ఘటనలు జరిగాయి” అని లేఖలో ఆయన పేర్కొన్నారు.”మద్యం, గంజాయి మత్తులో ఓ వ్యక్తి.. సులభంగా అలిపిరి చెక్‌ పాయింట్‌ను దాటుకొని వెళ్లి భక్తులను గాయపరిచారు. పవిత్రమైన పాప వినాశనం డ్యామ్‌లో నిబంధనలకు విరుద్ధంగా బోట్లను తిప్పారు. మార్చి 31న మతిస్థిమితం లేని వ్యక్తి బైక్ పై తిరుమల కొండపైకి చేరుకున్న విషయాన్ని లేఖలో వివరించారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video