డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిన విషయమే. అందుకే వైద్యులు ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ తినాలని సూచిస్తుంటారు. బాదం, అంజీర్, ఎండు ద్రాక్ష, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్లో ఉన్న పుష్కలమైన పోషకాలు శరీరాన్ని పుష్టిగా మార్చడంతో పాటు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మెదడు పనితీరును కూడా పెంచడంలో సహాయపడతాయి
అయితే చాలా మంది ఎండు ద్రాక్షను సహజంగానే తింటారు. కానీ నిపుణుల ప్రకారం, ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి తినడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఆయుర్వేదంలో కూడా ఎండుద్రాక్షను తీసుకోవడం ద్వారా అనేక లాభాలు ఉంటాయని చెప్పుకుంటున్నారు. ఈ స్టోరీలో ఎండు ద్రాక్షలు తీసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రక్తపోటు నియంత్రణ ఎండుద్రాక్షలో అధికంగా పొటాషియం ఉండడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇది పొటాషియం సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది. దీనితో పాటు డైటరీ ఫైబర్, పాలీఫెనాల్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
నానబెట్టిన ఎండుద్రాక్ష ఎముకలను బలపర్చడంలో సహాయపడుతుంది. మోకాళ్ళ నొప్పితో బాధపడేవారు ఎండుద్రాక్షను వాడడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఎముకలు బలంగా మారడంతో పాటు నడుము నొప్పి వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
కాలేయ ఆరోగ్యం ఎండుద్రాక్షను నానబెట్టిన నీరు తీసుకోవడం వల్ల కడుపులోని విషపదార్థాలు శుద్ధి అవుతాయి. ఇది కాలేయాన్ని శక్తివంతం చేసి, రక్త శుద్ధికి సహాయపడుతుంది. కాలేయ పనితీరు పెరిగి, జీర్ణం సరిగ్గా జరిగేందుకు సహాయపడుతుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. రోగనిరోధక శక్తి ఎండుద్రాక్ష జీవక్రియను మెరుగుపరిచే మరియు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ పండులోని డైటరీ ఫైబర్ మలబద్దకం తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన బారిన పడకుండా నివారిస్తుంది. అలాగే మన ఆరోగ్యం సరిగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. రక్తహీనత నివారణ ఎండుద్రాక్షలో అధికంగా ఐరన్, విటమిన్ B కాంప్లెక్స్ ఉంటాయి. ఇవి శరీరంలో రక్తం ఏర్పడడంలో సహాయపడతాయి. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు ఎండుద్రాక్షను తీసుకోవడం మంచి పరిష్కారం.

Leave feedback about this