June 8, 2025
జాతీయ వార్తలు

శివరాత్రి వేళ మరో విషాదం… ఇద్దరు గల్లంతు.. ఎక్కడంటే ?

ఏపీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాల్లో ఈ విషాదం జరిగింది. తమ్మిలేరు వాగులో స్నానాలకు దిగి ఇద్దరు యువకులు గల్లంతు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా.. మరో యువకుడు గల్లంతయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహా శివరాత్రిని పురస్కరించుకొని యువకులు వాగులో స్నానం చేయడానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే లోతు ఎక్కువగా ఉండడంతో యువకులు గల్లంతు అయినట్టు వాపోతున్నారు. వారిలో ఒకరు మృతి చెందగా.. మరో యువకుడి కోసం గాలిస్తున్నట్టు సమాచారం అందుతోంది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video