డ్వాక్రా సంఘాలు ఇప్పటి వరకు మహిళలకే పరిమితం. ఇక నుంచి పురుషులకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు అవుతున్నాయి. మహిళా సంఘాలకు ఇచ్చిన విధంగానే ఆర్దిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా విధి విధానాలు ఖరారు చేస్తున్నారు. పొదుపు సంఘాల వారీగా పురుషులు తమ స్వయం ఉపాధి పొందేలా ఈ నిర్ణయం రూపకల్పన చేసారు. రాష్ట్రంలో విజయవాడ – విశాఖలో ఏప్రిల్ లో ఈ పురుష డ్వాక్రా సంఘాలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే వెయ్యి సంఘాలు ఏర్పాటు దిశగా రంగం సిద్దమైంది.
25 నగరాల్లో అమలు జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ 2.0 కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 25నగరాల్లో పురుషులతో పొదుపు సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో తొలి విడతలో భాగం గా ఏపీలో విజయవాడ, విశాఖపట్టణంలో పొదుపు సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏప్రిల్ లో వీటిని ప్రారంభించేలా ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ సంఘాల ద్వారా మహిళలతో అమ లు చేసిన విధంగానే పురుషుల్లో పొదుపు అలవాటు చేయించాలన్న ఉద్దేశంతో పొదుపు సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసంఘటిత కార్మికుల ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం వీటిని రూపొందిస్తున్నారు. సంఘాలుగా ఏర్పడిన వారికి బ్యాంకుల నుంచి రుణాలిప్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు కేంద్రం ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది.
Leave feedback about this