క్షమాపణ చెప్పిన నారా లోకేష్
Nara Lokesh: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పరిధిలోని జ్యోతి మండలంలోని ప్రఖ్యాత అవధూత కాశిరెడ్డి నాయన ఆశ్రమం కూల్చివేత వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చెలరేగుతున్నాయి. అవధూత కాశిరెడ్డి నాయన పరమపదించిన స్థలం ఇది. ఇక్కడ పురాతన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కూడా ఉంది. అటవీ శాఖ