June 9, 2025

Blog

తాజా వార్తలు

క్షమాపణ చెప్పిన నారా లోకేష్

Nara Lokesh: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పరిధిలోని జ్యోతి మండలంలోని ప్రఖ్యాత అవధూత కాశిరెడ్డి నాయన ఆశ్రమం కూల్చివేత వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చెలరేగుతున్నాయి. అవధూత కాశిరెడ్డి నాయన పరమపదించిన స్థలం ఇది. ఇక్కడ పురాతన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కూడా ఉంది. అటవీ శాఖ

Read More
తాజా వార్తలు

పాఠశాల బస్సు బోల్తా.. 13 మందికి గాయాలు

AP: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాండ్రేగులలో ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీ స్వామి వివేకానంద స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది పిల్లలకు గాయాలయ్యాయి. వారిని జగ్గంపేట సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read More
తాజా వార్తలు

త్వరలో 900 అంగన్వాడీలు ప్రారంభం: మంత్రి

AP: మరో 2, 3 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 900 అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అంగన్వాడీల్లో తాగునీరు, టాయిలెట్ల కోసం రూ.7 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అలాగే గిరిజనుల కోసం 18 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. మరోవైపు మహిళల సాధికారత టీడీపీతోనే ప్రారంభమైందని వివరించారు.

Read More
ఆరోగ్యం

అన్నం పారేస్తున్నారా? భోజనం విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా? మహాదోషం!

అన్నం పరబ్రహ్మ స్వరూపమంటారు. అటువంటి అన్నాన్ని మనం ఎప్పుడూ గౌరవించాలి. భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా భోజన నియమాలను పాటించాలి. భోజనం పట్ల భక్తి భావాన్ని కలిగి ఉండాలి. చాలామంది భోజనం చేసేటప్పుడు తెలియకుండానే చెయ్యకూడని తప్పులు చేస్తూ ఉంటారు. పొరపాటున ఇటువంటి తప్పులు చేస్తే మహా పాపం తగులుతుందని చెబుతున్నారు పండితులు. పిల్లలకు భోజనం పెట్టి ఈ పని చెయ్యొద్దు మరి భోజనం చేసేటప్పుడు చేయకూడని ఆ తప్పులు ఏమిటో తెలుసుకుందాం. భోజనం చేసే సమయంలో చాలామంది

Read More
తాజా వార్తలు

అమరావతిలో 13 సంస్థలకు షాక్- కేబినెట్ సబ్ కమిటీ సంచలనం..!

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయినా ఇంకా అమరావతిలో నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంపై విమర్శలు వస్తున్న వేళ సచివాలయంలో భూకేటాయింపులపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో గతంలో ఇక్కడ భూములు తీసుకున్న 13 సంస్థలకు షాకిచ్చింది. రాజ‌ధానిలో గ‌తంలో భూములు తీసుకున్న 13 సంస్థ‌ల‌కు వాటి కేటాయింపులు ర‌ద్దు చేస్తూ

Read More
భక్తి

టీటీడీ శ్రీవారి ఆలయంలో ఉద్యోగి చేతివాటం-6 లక్షల విదేశీ కరెన్సీ స్వాహా..!

భక్తుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారిని వివాదాలు వీడటం లేదు. కల్తీ నెయ్యి ఆరోపణలతో మొదలైన వివాదాలు ఇప్పుడు హుండీ లెక్కింపులో దొంగతనాల వరకూ వచ్చాయి. అయితే ఈసారి తిరుమల ఆలయంలో కాకుండా చెన్నైలోని శ్రీవారి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. భక్తులు వెంకన్నకు ఇచ్చిన నగదు కానుకల్లో టీటీడీ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. దీంతో ఆలస్యంగా గుర్తించిన టీటీడీ అతన్ని సస్పెండ్ చేసింది. చెన్నైలోని టీటీడీ శ్రీవారి ఆలయంలో పరకామణిలో లెక్కింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయనే

Read More
తాజా వార్తలు

ప.గో. జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం -2025 సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో 7వ రోజు మహిళా సాధికారిత వారోత్సవాలను ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పోలీస్ అధికారులు మహిళలు, చిన్నారులకు అత్యవసర సమయంలో సహాయం కొరకు హెల్ప్‌లైన్ నెంబర్లు చైల్డ్ హెల్ప్ లైన్: 1098, ఉమెన్ హెల్ప్ లైన్: 181, పోలీస్ హెల్ప్ లైన్: 100, 112, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్: 1930, కాల్ చేయాలన్నారు.

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: ఈనెల 15 నుండి జాతీయస్థాయి నాటికల పోటీలు.

పాలకొల్లు కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 15, 16, 17 తేదీల్లో 16వ జాతీయ స్థాయి నాటికల పోటీలు జరుగనున్నాయి. ముఖ్య అతిథిగా రావాలని కోరుతూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని శనివారం పాలకొల్లు కళా పరిషత్ అధ్యక్షులు కె. వి. కృష్ణ వర్మ, మానపురం సత్యనారాయణ, జక్కంపూడి కుమార్, మేడికొండ శ్రీనివాస్ చౌదరి, కొల్లి కొండా ప్రసాద్, కొణిజేటి గుప్తా తదితరులు ఆహ్వానించారు.

Read More
జాతీయ వార్తలు

ఏపీకి 2 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు

AP: రాష్ట్రంలో 2 గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అమరావతి, శ్రీకాకుళంలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వీటికి సంబంధించి ప్రీ-ఫిజిబిలిటిని పరిశీలించేందుకు.. సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక రూపొందించేందుకు కన్సల్టెంట్లల నియామకానికి ఏపీఏడీసీ టెండర్లు పిలిచింది. ఆన్‌లైన్‌లో టెండర్ల దాఖలుకు ఈ నెల 21 వరకు గడువు ఇచ్చింది.

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: జనసేన ఆవిర్భావ సభకు తరలిరావాలి

ఈనెల 14న పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు పాలకొల్లు మండలం నుండి పెద్ద సంఖ్యలో వెల్లడానికి తీసుకోవలసిన ఏర్పాట్లపై శనివారం మండల నాయకుడు సాధనాల దుర్గబాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జనసేన ఆవిర్భావ సభకు వేలాదిగా తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జిల్లా కార్యదర్శి బోనం చినబాబు, జిల్లా ప్రచార విభాగం కోఆర్డినేటర్ తులా రామలింగేశ్వరరావు పాల్గొన్నారు.

Read More