వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బెయిల్ను రద్దుచేయాలని
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బెయిల్ను రద్దుచేయాలని.. ఆయనపై నమోదైన అక్రమాస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ ఎంపీ, ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మరో ధర్మాసనానికి బదిలీ అయింది. ఇప్పటి వరకూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్లతో కూడిన ధర్మాసనం దానిని విచారించగా.. సోమవారం ఆ పిటిషన్ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.