June 8, 2025

తాజా వార్తలు

తాజా వార్తలు

22న పాలకొల్లులో మెగా జాబ్ మేళా!

పాలకొల్లు చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈ నెల 22న దివిస్ లేబొరేటరీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. ఇంటర్వ్యూలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు బీఎస్సీ, బీటెక్, ఎంఎస్సీ, బి. ఫార్మసీ, ఎం. ఫార్మసీలలో ఉత్తీర్ణులై, 21-25 వయస్సు ఉండాలన్నారు. పురుష అభ్యర్థులు అర్హులని ఆయన వివరించారు.

Read More
తాజా వార్తలు

‘తల్లికి వందనం’ , రైతు భరోసా అమలు ఇలా – ప్రభుత్వం తాజా నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వం హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్ హామీల పైన హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలవుతోంది. ఇక, తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ అమలు పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 28న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ రెండు పథకాలకు నిధుల కేటాయింపుతో పాటుగా అర్హతల

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: సానుకూలంగా రాష్ట్రాల జల వివాదాలు: మంత్రి నిమ్మల

రాజస్థాన్ ఉదయపూర్ లో 2వరోజు అన్ని రాష్ట్రాల జాతీయస్థాయి ఇరిగేషన్ మంత్రుల సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు డీకే శివశంకరం, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో చర్చించామని, జలాల పంపిణీ వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు.

Read More
తాజా వార్తలు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లైన్ క్లియర్..: తొలి దశలో

Visakhapatnam Steel Plant: రాష్ట్రానికే తలమానికంలా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ అమలులోకి వచ్చింది. వీఆర్ఎస్‌కు యాజమాన్యం తెర తీసింది. తొలి దశలో 1,140 మంది ఉద్యోగులకు వీఆర్ఎస్ అనుమతి లభించింది. ఈ మేరకు వారికి నోటీసులు సైతం జారీ చేసినట్లు తెలుస్తోంది. కిందటి నెలలో వీఆర్‌ఎస్‌ ప్రతిపాదనలను స్వీకరించింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. మొత్తం 1,613 మంది వీఆర్ఎస్ కోసం దరఖాస్తు దాఖలు చేసుకున్నారు. వాటిని పరిశీలించడానికి

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: ఉద్యానవన పంటలకు నూరు శాతం సబ్సిడీ: కలెక్టర్

జిల్లాలో ఉద్యానవన పంటల ప్రోత్సాహానికి రైతులను గుర్తించి, ఉపాధి హామీ పథకం ద్వారా నూరు శాతం సబ్సిడీ అందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఉద్యాన పంటలకు నూరు శాతం సబ్సిడీ రుణాలు అందించే విధానంపై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Read More
తాజా వార్తలు

ఉద్యోగులు, విద్యా సంస్థలకు ప్రత్యేక సెలవు…!!

వచ్చే వారం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 26న మహాశివరాత్రి సెలవు. కాగా, 27న ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఉద్యోగులు.. ఉపాధ్యా యులకు ప్రత్యేకంగా సెలవు ఇవ్వాలని ఎన్నికల ప్రధానాధికారి జిల్లా కలెక్టర్లకు సూచించారు. అదే సమయంలో అవసరమైతే ఓట్ల లెక్కింపు రోజు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సెలవు పైన నిర్ణయం తీసుకోవాలని సీఈవో వివేక్ యాదవ్ ఆదేశించారు. 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న ఓట్ల లెక్కింపు కు

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: మంత్రి ప్రజెంటేషన్ పై ప్రశంసల జల్లు

రాజస్థాన్ ఉదయపూర్లో మంత్రి రామానాయుడుకు అపూర్వ గౌరవం దక్కింది. రెండు రోజులు పాటు జరిగే ఈ సమావేశాల్లో మొదటిరోజు ఆయన వికసిత భారత్ 2047లో భాగంగా జల సంరక్షణ అంశాలపై మాట్లాడి ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి రామానాయుడు మాట్లాడిన తీరు, ప్రజెంటేషన్ విధానం పై వేదికపై ఉన్న ఒరిస్సా సీఎంతో సహా అందరూ ప్రశంసించారు. వేదిక కింద కూర్చున్న ఐఏఎస్ అధికారులు సైతం బాగా ప్రిపేర్ చేసి ప్రజెంటేషన్ చేశారంటూ అభినందనలు తెలిపారు.

Read More
తాజా వార్తలు

Maha Kumbh: కుంభమేళాలో పవన్- భార్య లెజ్నెవా, కొడుకు అకీరాతో పుణ్యస్నానం..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ప్రయాగ్ రాజ్ చేరుకున్న పవన్.. సతీమణి అన్నా లెజ్నెవా, కుమారుడు అకీరా నందన్ తో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా పవన్ తో పాటు కుటుంబ సభ్యులకు స్థానిక పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కుంభమేళాలో తొక్కిసలాటలు, అవాంఛనీయ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కు పుణ్యస్నానం పూర్తయ్యే వరకూ

Read More
తాజా వార్తలు

అంగన్‌వాడీ టీచర్లకు 120 రోజులపాటు సర్టిఫికెట్‌ కోర్సు శిక్షణ

ఏపీలోని పాఠశాల విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బాల్య సంరక్షణ, విద్యపై అంగన్‌వాడీ టీచర్లకు 120 రోజుల సర్టిఫికెట్‌ కోర్సును ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 మంది అంగన్‌వాడీ టీచర్లకు ఈ శిక్షణ అందించనున్నారు. ఇందులో భాగంగా ప్రథమ్‌ సంస్థ ద్వారా ఆరు రోజుల ఆఫ్‌లైన్‌ శిక్షణను మంగళవారం నుంచి ప్రారంభించారు.

Read More
తాజా వార్తలు

మహిళల భద్రతకు ప్రత్యేక వాచ్ రోజురోజుకూ మహిళలపై నేరాలు

అధికమవుతున్న నేపథ్యంలో వారి భద్రత కోసం తమిళనాడు యువకుడు రామకిషోర్ వాచ్ రూపొందించారు.“దాడి జరుగుతున్నప్పుడు బాధితురాలు వాచ్పి ఫింగర్ ప్రింట్వేసి ఆగంతకుడికి తాకించగానే..5 కిలోవాట్ల కరెంట్ అతడికి ప్రసరించి షాక్తో అచేతన స్థితిలోకి వెళ్లిపోతాడు. గడియారం సెల్ఫోను అనుసంధానమై ఉన్నందున తల్లిదండ్రులు, పోలీసులకు బాధితురాలు ఎక్కడ ఉందనే సమాచారం వెళ్లిపోతుంది. ఇందులోని బ్యాటరీని అరగంట పాటు ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది.

Read More