సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(CBSE) విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2026 నుంచి ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తామని తెలిపింది. నూతన జాతీయ విధానం 2020 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ స్కోర్లు సాధించేందుకే ఈ విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొంది.ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. జాతీయ విద్యా పరిశోధన సంగథన్, నవోదయ విద్యాలయ సమితి, కేంద్రీయ విద్యాలయ సంగటన్ కు చెందిన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం.. సెంటర్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఏటా రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిం చాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు ముసాయిదాపై సంతకాలు చేశారు.
ఎడ్యుకేషన్ & కెరీర్
విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏడాదికి రెండు సార్లు 10th calss బోర్డు ఎగ్జామ్స్..
- by kowru Lavanya
- February 22, 2025
- 0 Comments
- Less than a minute
- 30 Views
- 4 months ago

Leave feedback about this