June 8, 2025
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీ ఇంటర్ లో కీలక మార్పులు-ఎన్సీఈఆర్టీ సిలబస్-ఒక్క మార్కు ప్రశ్నలు..!

ఏపీలో ఇంటర్ మీడియట్ విద్యలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం అంటే 2025-26 నుంచి ఈ మార్పుల్ని అమలు చేసేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమవుతోంది. ఈ మేరకు కాలేజీలకు సమాచారం కూడా ఇచ్చింది. ముఖ్యంగా సిలబస్ తో పాటు పరీక్షల విధానంలోనూ పెను మార్పులు చేస్తోంది. దీంతో ఇంటర్ ఫస్టియర్ చదివే విద్యార్ధులకు ఎన్సీఈఆర్టీ సిలబస్ అందుబాటులోకి రానుంది. అలాగే పరీక్షల్లో ఒక్క మార్కు ప్రశ్నలు రాబోతున్నాయి.ఇంటర్ లో మ్యాథ్స్ పేపర్ ఇప్పటివరకూ 75 మార్కుల చొప్పన ఏ,బీగా 150 మార్కులకు ఉండగా దీన్ని కలిపేసి 100 మార్కుల పేపర్ గా మార్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇప్పటివరకూ 60 మార్కుల చొప్పున ఉండగా… వీటిని 85 మార్కులకు పెంచారు. ఫస్టియర్ లో 15, సెకండియర్ లో 15 మార్కులు ప్రాక్టికల్స్ కు కేటాయించారు. బైపీసీ విద్యార్ధులకు బోటనీ, జువాలజీ కలిపి బయోలజీపేపర్ గా మారబోతోంది. ఇందులో బోటనీ 43 మార్కులు, జువాలజీ 42 మార్కులు కలిపి మొత్తం 85 మార్కులకు పేపర్ ఇస్తారు. సీఈసీ విద్యార్ధులకు కామర్స్, అకౌంటెన్సీ కలిపి 50 మార్కుల పేపర్ ఉంటుంది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video