June 8, 2025
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీలో మొదలైన ఇంటర్ పరీక్షలు-ఆ నిబంధన పక్కాగా అమలు..!

ఏపీలో ఇంటర్ మీడియట్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్ధులు ఈ పరీక్షలు రాస్తున్నారు. మొత్తం 10.58 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే వీరికి హాల్ టికెట్లు కూడా జారీ చేశారు. దీంతో ఇవాళ పరీక్ష కేంద్రాలకు భారీ ఎత్తున విద్యార్ధులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా భారీ భద్రత, నిఘా ఏర్పాటు చేసింది.

ఇంటర్ పబ్లిక్ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1535 సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతీ జిల్లాలోనూ తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ అభ్యర్ధులు పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. దీంతో అభ్యర్ధుల్ని 8.45 గంటలకే చేరుకోవాలని అధికారులు ముందుగానే సూచించారు. అయినా ఆలస్యంగా వచ్చిన వారిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించడం లేదు. నిమిషం ఆలస్యమైనా అనుమతించకూడదనే నిబంధన అమలు చేస్తున్నారు.

గతంలో చోటు చేసుకున్న ప్రశ్నాపత్రాల లీకేజీ, మాస్ కాపీయింగ్ ఘటనల్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి పరీక్షా కేంద్రాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాలను ‘నో మొబైల్‌ జోన్‌’గా ప్రకటించారు. అధికారిక సమాచారం కోసం మాత్రం పరీక్షల చీఫ్‌ సూపరింటెండెంట్‌కు మాత్రం ఓ కీప్యాడ్‌ ఫోన్‌ను అనుమతిస్తున్నారు. ఇంటర్మీడియట్‌ రెండు సంవత్సరాల విద్యార్థులకు రోజు మార్చి రోజు పరీక్షలు జరుగుతాయి. అనంతరం వచ్చే నెలలో ఫలితాలు విడుదల చేసే అవకాశముంది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video