ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు 3 రోజుల పాటు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆలయాలు, రాజగోపురాలను ముస్తాబు చేశారు. 1982లో ఆనాటి శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యులచే కుంభాభిషేకం జరగ్గా.. మళ్లీ 42 ఏళ్లకు మహాఘట్టం జరగనుంది. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Leave feedback about this