ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీల పై ఉన్న నిషేధం ఎత్తివేసింది. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోజు నుంచి జూన్ 2వ తేదీ వరకు బదిలీల పైన ఉన్న నిషేధాన్ని సడలిస్తున్నట్లు వెల్లడించింది. మినహాయింపులు.. ఖచ్చితంగా బదిలీ లపైనా స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు మార్గదర్శకాలతో జీవో జారీ చేసింది. కాగా.. బదిలీలకు సంబంధించి విభాగాధిపతులే బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది.ఏపీలో ఉద్యోగుల బదిలీల పైన ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారికి మార్పు తప్పనిసరని స్పష్టం చేసింది. ఐదేళ్లు పూర్తికాని ఉద్యోగులు కూడా అభ్యర్థనపై బదిలీకి అర్హులే. అలాగే 2026 మే 31లోపు రిటైర్ అయ్యే వారికి బదిలీ ఉండదు. వారిని విజ్ఞప్తిపై లేదా పరిపాలన కారణాలతో బదిలీ చేయొచ్చని మార్గదర్శకాల్లో పేర్కొంది. బదిలీ కోసం ఒక స్టేషన్లో అన్ని కేడర్లలో పనిచేసిన కాలాన్ని పరిగణిస్తారని ఉత్తర్వుల్లో తెలిపింది. ఉద్యోగి పనిచేసిన నగరం, పట్టణం, గ్రామంగా పరిగణిస్తారు కానీ కార్యాలయం, సంస్థను పరిగణ నలోకి తీసుకోరని స్పష్టం చేసింది. బదిలీల్లో దృష్టి సమస్యలున్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకుపైగా పనిచేసిన వారికి, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఉద్యోగి, భాగస్వామి, వారిపై ఆధారపడిన పిల్లల్లో ఎవరికైనా క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే ఆ వైద్య సదుపా యాలున్న చోటుకు బదిలీకి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కారుణ్య నియామకం కింద నియమితులైన వితంతు మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యముంటుంది. పదోన్నతి ఉంటే తప్పనిసరిగా ప్రస్తుత స్థానం నుంచి బదిలీ అవుతారని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ఇతర ప్రాంతాల్లో పదోన్నతి పోస్టు లేకపోతే మాత్రమే ప్రస్తుత స్థానంలో కొనసాగుతారని వెల్లడించింది. దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే వారిని ఒకేచోట లేదా దగ్గరగా ఉండేచోట్ల నియమించేలా చూడాలని ప్రభుత్వం స్పష్టంచేసింది.
ఎడ్యుకేషన్ & కెరీర్
బదిలీల వేళ ఉద్యోగులకు కీలక అప్డేట్- ప్రాధాన్యత, మినహాయింపులు..!!
- by kowru Lavanya
- May 16, 2025
- 0 Comments
- Less than a minute
- 3 Views
- 5 hours ago

Leave feedback about this