June 8, 2025
భక్తి

కుంభేమళాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు- పుణ్యకేత్రాల రూట్, ప్యాకేజీ..!!

Mahakumbh Mela 2025: మహాకుంభ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటి వరకు 11 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లు అంచనా. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. విదేశీయులు సైతం సంప్రదాయ రీతిలో స్నానాల కోసం ప్రయాగ్ రాజ్ కు వస్తున్నారు. ఈ సమయంలోనే ఏపీ నుంచి వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీకీ కీలక నిర్ణయం తీసుకుంది. మహాకుంభ్ కు వెళ్లేవారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. పుణ్యక్షేత్రాల సందర్శ న తో కలిపి ప్యాకేజీ ఖరారు చేసింది.

ఏపీ నుంచి కుంభమేళాకు వెళ్లే వారికి ప్రత్యేకంగా పూరీ, కోణార్క్‌, ప్రయాగ్‌రాజ్‌, వారణాసి, బుద్ద గయ, కాశీ తదితర క్షేత్రాల దర్శనం చేయించనున్నట్లు తెలిపారు. సూపర్‌ లగ్జరీ బస్సుల్లో ఒక్కొక్కరికి రానుపోను టికెట్‌, భోజన సదుపాయం కలిపి రూ.10,000లు, స్లీపర్‌ బస్సులో ఒక్కొ క్కరికీ రూ.15,000లు తీసుకుంటున్నారు. ప్రయాణీకులు బృందంగా బస్సులు బుక్ చేసుకుంటు న్నారు. రాజమండ్రి నుంచి ఫిబ్రవరి 4న ప్రత్యేక బస్సు బయల్దేరనుంది. ప్రయాణం చేసే ప్రాంతం నుంచి టికెట్ ధర ఖరారు చేయనున్నారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video