June 8, 2025
తాజా వార్తలు

జస్ట్ 23 నిమిషాల్లో ‘సింధూర్’ పూర్తి – పాక్ లోకి చొచ్చుకెళ్లి, నేరుగా గురి..!!

భారత సైన్యం వైపు ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది. భారత్ లో ఉగ్రదాడుల పైన ప్రతీకారం ఏంటో ప్రపంచానికి చాటారు. దాదాపు అయిదు దశాబ్దాల తరువాత పాక్ భూ భాగంలోని ఉగ్రవాద శిబిరాల పైన భారత సైన్యం విరుచుకు పడింది. పక్కా ప్లాన్ తో అనుకున్న ముహూర్తానికి భారత్ వైమానిక దళం ఉగ్రవాద క్యాంపుల పైన క్షిపణులతో దాడి చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టు బెట్టింది. ప్రధాని మోదీ స్వయంగా ఈ ఆపరేషన్ సింధూర్ ను పర్యవేక్షించారు. భారత్ సైన్యానికి దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది.

భారత్ సైన్యం పాక్ తో పాటుగా పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను మట్టు బెట్టింది. అర్ద్రరాత్రి సరిగ్గా 1.44 గంటలకు ఈ వైమానిక దాడులు మొదలయ్యాయి. కేవలం 23 నిమిషాల వ్యవధిలో నే ఆపరేషన్ పూర్తి చేసాయి. తామ ప్రతీకార దాడులకు దిగుతామని పాకిస్థాన్ పదే పదే చెప్పినా.. కనీసం ఒక్క విమానం కూడా ప్రతిగా పైకి లేవలేదు. ఎక్కడా ప్రతిఘటన కనిపించ లేదు. ఎల్ఓసీ వద్ద మాత్రం కాల్పులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ లోని 9 ఉగ్రవాద శిబిరాల పైన భారత్ సైన్యం విరుచుకు పడింది. పక్కా సమాచారంతో దాడులకు దిగింది. పాక్ లోని సామాన్యులు.. ఆర్దిక.. వైద్య రంగాలకు ఏ మాత్రం నష్టం లేకుండా ఉగ్రవాద శిబిరాల పైనే గురి పెట్టింది. ఈ మెరుపు దాడుల్లో జైషే ఈ మహ్మద్, లష్కరే సంస్థల అగ్ర నేతలు హతం అయ్యారు.

ఈ దాడులతో పాక్ కు వెన్నులో వణుకు పట్టింది. దాడులను తిప్పి కొట్టే సాహసం చేయలేదు. కాగా, ఇప్పుడు పాక్ మంత్రులు మాత్రం గొప్పలు పోతున్నారు. తాము భారత్ విమానాలను కూల్చేసామని ప్రకటనలు చేస్తున్నారు. ఇటు ఇదే సమయంలో పాక్ పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలనే పార్టీలకు అతీతంగా కేంద్రానికి డిమాండ్లు వస్తున్నాయి. ఇక, భారత్ సైన్యం ముజఫరాబాద్‌లో 2 దాడులు చేసింది. బహవల్పూర్‌లో మూడవ దాడి చేసింది. కోట్లిలో, చక్ అమ్రు, గుల్పూర్‌, భింబర్‌, మురిడ్కే, సియాల్‌కోట్‌లో దాడి చేసినట్లు భారత్ ప్రకటించింది. ఇటు పాకిస్థాన్ స్పందన ఎలా ఉంటుందని భారత్ అంచనా వేస్తోంది. ప్రధాని కార్యాలయం కేంద్రంగా వార్ రూమ్ లో కీలక మంత్రాంగం సాగుతోంది. పాక్ నుంచి ఎలాంటి స్పందన ఎదురైనా తిప్పి కొట్టేందుకు భారత్ సమాయత్తం అవుతోంది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video