Tirumala: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 78,892 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,930 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.55 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.శ్రీవారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లల్లో వేచివుండట్లేదు. క్యూలైన్ ద్వారా నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్లొచ్చు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.
భక్తి
కలియుగ వైకుంఠాన్ని కాచే క్షేత్రపాలకుడెవరో తెలుసా?- రేపే
- by kowru Lavanya
- February 25, 2025
- 0 Comments
- Less than a minute
- 50 Views
- 3 months ago

Leave feedback about this