ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో భారత జట్టు విజయాన్ని అందుకుంది. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఫైనల్కు చేరిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన 264 పరుగులకు అలౌట్ అయింది. స్మిత్ 73,అలెక్స్ క్యారీ 61,ట్రావిస్ హెడ్ 39 పరుగులు చేశారు.265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. రోహిత్ శర్మ,శుభ్మన్ గిల్ వికెట్లను టీమిండియా త్వరగానే కోల్పోయింది.దీంతో ఇండియా జట్టు విజయం సాధిస్తుందా అనే అనుమానం అభిమానుల్లో మొదలైంది.
ఇటువంటి సమయంలో క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ జట్టును విజయం వైపు నడిపించారు.సింగిల్స్ తీస్తూ ఆసీస్ జట్టుపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలోనే కోహ్లీ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.అర్థ సెంచరీ దగ్గరకు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 45 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. సెంచరీ సాధిస్తాడని అనుకున్న కోహ్లీ 84 పరుగుల వద్ద జంపా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. చివర్లో పాండ్యా మెరుపు ఇన్నింగ్స్తో జట్టును విజయపథం నడిపించాడు.మిగిలిన తతంగాన్ని కేఏల్ రాహుల్, జడేజా పూర్తి చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కోహ్లీకి దక్కింది. బుధవారం జరిగే రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్-సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఇక్కడ విజయం సాధించిన జట్టుతో టీమిండియా ఫైనల్లో తలపడనుంది.

Leave feedback about this