ఇప్పుడు మెజారిటీ ప్రజలను ఇబ్బంది పెడుతున్న, చాలా మందికి నిద్రలేకుండా చేస్తున్న ఆరోగ్య సమస్య ఏదైనా ఉందంటే అది మధుమేహం. ఈ సమస్య కారణంగా చాలా మంది తమకు నచ్చినట్టుగా జీవించలేకపోతున్నారు. కోరుకున్న ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా చాలా ఎక్కువగా అల్లాడిపోతున్నారు. అలాగే ఎన్నో సమస్యలను అనుభవిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్య ఉన్న వ్యక్తులు మధుమేహాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవన శైలి, వ్యాయామం, మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి బారి నుంచి మనం బయటపడొచ్చు.
అయితే ఎవరైతే మధుమేహంతో బాధపడుతున్నారో వారికి అరటిపువ్వు దివ్య ఔషధంలా పని చేస్తుంది. ఈ పువ్వు తింటే మధుమేహం నుంచి తప్పించుకోవడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు మధుమేహం ఉన్న వ్యక్తులకు ఈ అరటిపువ్వు ఏ విధంగా పని చేస్తుంది? దీనిని తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మధుమేహం రోగులకు అరటిపువ్వు ఎలా పని చేస్తుందంటే.. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణ వివిధ పరిశోధనల ప్రకారం, అరటి పువ్వులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా 2011లో జరిగిన ఓ అధ్యయనంలో మధుమేహంతో బాధపడుతున్న ఎలుకలపై అరటి పువ్వుల ప్రభావాన్ని పరిశీలించారు. ఫలితంగా, ఈ ఎలుకల రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు కనుగొన్నారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ను తగ్గించడంలో సహాయపడుతుంది అరటిపువ్వులో ఉండే నూన్యత కలిగిన ఫైబర్, కొన్ని జవసక్రియాత్మక పదార్థాలు శరీరంలోని ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. తద్వారా రక్తంలో షుగర్ పెరగకుండా ఉంటుందని పేర్కొంటున్నారు.
మానసిక ఒత్తిడి తగ్గింపు అరటి పువ్వుల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మెగ్నీషియం సాధారణంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ నేపథ్యంలోనే అరటిపువ్వు తీసుకోవడం వలన అందులోని మెగ్నీషియం మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచుతుంది. తద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుంది.

Leave feedback about this