వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బెయిల్ను రద్దుచేయాలని.. ఆయనపై నమోదైన అక్రమాస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ ఎంపీ, ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మరో ధర్మాసనానికి బదిలీ అయింది. ఇప్పటి వరకూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్లతో కూడిన ధర్మాసనం దానిని విచారించగా.. సోమవారం ఆ పిటిషన్ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఏళ్ల తరబడి పురోగతి లేదని రఘురామరాజు తరఫు సీనియర్ న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పదేళ్లుగా జగన్ బెయిల్ పైనే ఉన్నారని, సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా గత 12 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని.. సీబీఐ, నిందితులు అవగాహనతో ఉన్నారనిపిస్తోందని తెలిపారు. డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు విన్నాక.. నిర్ణయం వెలువరించకుండానే ఐదుగురు న్యాయాధికారులు బదిలీ అయ్యారని ప్రస్తావించారు. వాదనలు వినిపించేందుకు సమయం కావాలని.. అదనపు సొలిసిటర్ జనరల్ మరో కేసులో వాదనలు వినిపిస్తున్నందున వాయిదా వేయాలని సీబీఐ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను 27కి వాయిదా వేసింది.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బెయిల్ను రద్దుచేయాల
Leave feedback about this