June 8, 2025
భక్తి

తిరుమలలో భక్తులకు అరుదైన అవకాశం- ఒకేరోజు: వారికి అనుమతి లేదు

Tirumala: తిరుమలలో అరుదుగా సందర్భం చోటు చేసుకోనుంది. రెండు మహోత్సవాలు ఒకేరోజు కలిసి రానున్నాయి. ఇందులో పాల్గొనే అవకాశం అశేష భక్తజనానికి కలిగింది. ఈ రెండింటినీ విజయవంతం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు సమీక్షలు సైతం నిర్వహించారు.

బుధవారం నాడు అంటే ఈ నెల 12వ తేదిన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి మహోత్సవం జరుగనుంది. అదే రోజున పౌర్ణమి గరుడ సేవను టీటీడీ అధికారులు కన్నుల పండువగా నిర్వహించనున్నారు. ఈ రెండూ ఒకేరోజున కలిసి రావడాన్ని అరుదైన, విశేష సందర్భంగా భావిస్తారు భక్తులు.

అతి ముఖ్యమైన తీర్థోత్సవాలలో తిరుమలలో జరిగే అతి ముఖ్యమైన తీర్థోత్సవాలలో ఒకటి రామకృష్ణతీర్థ ముక్కోటి. శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షలను సైతం ఇదివరకే నిర్వహించారు కూడా. దీనికి అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయనుంది.

పౌర్ణమి గరుడ సేవ.. అదే రోజున పౌర్ణమి గరుడ సేవ వైభ‌వంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో విహ‌రిస్తారు. భక్తులకు దర్శనమిస్తారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video