June 8, 2025
ఎడ్యుకేషన్ & కెరీర్

విద్యార్ధులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్-ఆ పథకానికి రూ.600 కోట్లు విడుదల..!

ఏపీ విద్యార్దులకు ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో విద్యాసంస్ధల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్ధులకు ఊరటనిస్తూ ఓ కీలక పథకానికి సంబంధించి రూ.600 కోట్ల బకాయిల్ని ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలో మరో విడతగా రూ.400 కోట్లు విడుదల చేస్తామని కూడా ప్రకటించింది. ఆ లోపు విద్యార్ధుల్ని ఇబ్బందిపెడితే ఊరుకోబోమని విద్యాసంస్థల్ని హెచ్చరించింది.ఏపీలో 2024-25 ఆర్ధిక సంవత్సరంలో విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల బకాయిలు భారీగా పేరుకుపోయాయి.దీంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్లో రూ.600 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో విద్యార్ధులు తమ ఫీజుల్ని స్కూల్స్, కాలేజీలకు చెల్లించేందుకు వీలు కలిగింది. ఇప్పటికే ఆయా విద్య సంస్థలు ఫీజు చెల్లించలేదన్న కారణంతో విద్యార్ధులకు పలు చోట్ల హాల్ టికెట్లు నిరాకరిస్తున్నాయి.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video