ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత విద్యామంత్రిగా ఏరికోరి బాధ్యతలు తీసుకున్న నారా లోకేష్.. ఇప్పుడు తన శాఖలో కీలక సంస్కరణలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే టీచర్లపై పనిభారం తగ్గింపు, బోధనేతర పనులకు దూరంగా ఉంచడం వంటి చర్యలు తీసుకున్న మంత్రి లోకేష్.. ఇప్పుడు ప్రైవేటు స్కూళ్లు, ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు వాటి యాజమాన్యాలతో భేటీ అయిన లోకేష్.. అనంతరం కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న ప్రైవేటు స్కూళ్లు, డిగ్రీ కాలేజీలు ఎప్పటి నుంచో సమస్యలు ఎదుర్కుంటున్నాయి. ఈ నేపథ్యంలో వాటి యాజమాన్యాలతో భేటీ అయిన లోకేష్.. వారి సమస్యలు విని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం సంస్కరణల దిశగా వెళుతోందని, కాబట్టి వాటికి సహకరించాలని వారిని కోరారు. ఇందులో భాగంగా వారికి కావాల్సిన వెసులుబాట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. ఇందులో భాగంగా ప్రైవేటు స్కూళ్లు, డిగ్రీ కాలేజీల గుర్తింపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Leave feedback about this