మహా కుంభమేళాకు రద్దీ పెరుగుతోంది. ఇప్పటికే 32 కోట్ల మంది పుణ్య స్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 26వ తేదీ వరకు కుంభమేళా కొనసాగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ లోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా తిరు
మహాకుంభ మేళాకు ఏపీ నుంచి వెళ్లే భక్తుల రద్దీ పెరుగుతోంది. రైళ్లతో పాటుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అదే విధంగా టూరిజం శాఖ ప్యాకేజీలను ప్రకటించింది. అయినా, ఇంకా రద్దీ కొనసాగుతోంది. ప్రత్యేక రైళ్లళ్లో పెరుగుతున్న రద్దీ కారణంగా.. అదనపు కోచ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక, తిరుపతి నుంచి కుంభమేళాకు వెళ్లే ప్రయాణీకుల కోసం తాజాగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తిరుపతి- దానాపూర్ మధ్య (వయా హైదరా బాద్ ) ఈ ప్రత్యేకరైళ్లు నడుస్తాయని అధికారులు వెల్లడించారు.
Leave feedback about this