June 8, 2025
తాజా వార్తలు

మాడు పగులుతోంది, కొత్త రికార్డు – తాజా హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరో రెండు రోజుల పాటు మాడు పగిలే ఎండలు కాస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఈ సీజన్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక వేడి నమోదవుతోంది. తాజా గా ప్రకాశం జిల్లాలో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు అయింది. 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక.. 89 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది.

తీవ్ర వడగాలులు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతకు మాడు పగులుతోంది. రికార్డు స్థాయిలో పలు ప్రాంతాల్లో వేసవి తీవ్రత పెరుగుతోంది. గురువారం ఏపీలోని 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 42.4 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడు లో 42.2, కడప జిల్లా ఒంటిమిట్టలో 42.1 కర్నూలులో 41.7, పార్వతీపరం మన్యం జిల్లా సేదుపేట లో 41.4, తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.3, చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నంద్యాల జిల్లా రుద్రవరం లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 15 మండలాల్లో తీవ్ర వడగాలులు, 91 మండలాల్లో వడగాలులు వీచాయి.

తీవ్ర వడగాలులు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతకు మాడు పగులుతోంది. రికార్డు స్థాయిలో పలు ప్రాంతాల్లో వేసవి తీవ్రత పెరుగుతోంది. గురువారం ఏపీలోని 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 42.4 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడు లో 42.2, కడప జిల్లా ఒంటిమిట్టలో 42.1 కర్నూలులో 41.7, పార్వతీపరం మన్యం జిల్లా సేదుపేట లో 41.4, తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.3, చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నంద్యాల జిల్లా రుద్రవరం లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 15 మండలాల్లో తీవ్ర వడగాలులు, 91 మండలాల్లో వడగాలులు వీచాయి.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video