పంచాయతీలపై పవన్ మార్క్-కీలక మార్పు-ఏప్రిల్ నుంచి అమలు..!
ఏపీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖపై తన ముద్ర చూపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పంచాయతీల బలోపేతంతో పాటు గ్రామ స్వరాజ్యం సాధన కోసం పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. సచివాలయాల ప్రక్షాళన తరహాలో పంచాయతీల్లోనూ మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. అలాగే దీన్ని అమల్లో పెట్టేశారు.రాష్ట్రంలోని పంచాయతీల్ని బలోపేతం చేసేందుకు నిధులు ఇస్తున్న కూటమి సర్కార్.. అలాగే పాలనా