‘పాకిస్థాన్ ఎడారిలా మారాల్సిందే.. చుక్క నీరు కూడా వెళ్లనీయం’
జమ్ము కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రణాళికలు చేస్తోంది. అందులో భాగంగానే సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు చేసింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్- పాకిస్థాన్ మధ్య ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. నీటిని తక్షణమే నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ