ఏపీలో సివిల్ జడ్జీ ఉద్యోగాలు, రూ. లక్ష వరకు జీతం
న్యాయస్థానాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలు కీలక ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ హైకోర్టు సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేసేందుకు నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో 40 పోస్టులను డైరెక్ట్ రెక్రూట్మెంట్ ద్వారా, మరో 10 పోస్టులను బదిలీల ద్వారా భర్తీ చేయనున్నారు.