June 8, 2025

తాజా వార్తలు

తాజా వార్తలు

పాలకొల్లు: దగ్గులూరు గవరపేట గ్రామాల్లో పొలం పిలుస్తుంది

పాలకొల్లు మండలం దగ్గులూరు, గవరపేట గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మంగళవారం జరిగింది. వ్యవసాయ శాఖ ఏ. డి. ఏ పార్వతి మాట్లాడుతూ దాళ్వా సీజన్ లో ఈ పంట నమోదు జరుగుతుందని, రైతులు తమ చేలలో ఏ వరి రకం సాగు చేస్తున్నారనే విషయాన్ని నమోదు చేయించుకోవాలని చెప్పారు. డ్రోన్లతో పిచ్చికారి చేసుకోవడం వలన ఖర్చు సమయం ఆదా అవుతుందని తెలిపారు. సర్పంచ్ పొలిమేర వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు

Read More
తాజా వార్తలు

అన్న క్యాంటీన్‌లో వారికి నో ఎంట్రీ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లలో కొత్త చిక్కు ఎదురవుతోంది.చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు. కడుపునిండా భోజనం చేయవచ్చు. పెద్ద పెద్ద హోటల్లో అందించేంత మెనూతో పరిశుభ్రతతో భోజనం వడ్డిస్తారు. కార్మికులు, కూలీలు, ఆటో డ్రైవర్లు, వీధుల్లో షాపులు నడిపేవారు ఇలా ఎంతో మందికి అన్నా క్యాంటిన్లు ఆకలి తీర్చుతున్నాయి. కేవలం 5 రూపాయలకే రుచికరమైన భోజనం దొరకుతుండటంతో పెద్ద సంఖ్యలో పేదలు భోజనం చేసేందుకు అన్నా క్యాంటిన్ కు

Read More
తాజా వార్తలు

పాలకొల్లులో యువకుడు గల్లంతు

పాలకొల్లు పట్టణంలో ఉన్న పెద్ద కుళాయి చెరువులో సోమవారం సాయంత్రం మధకాని హరికృష్ణ (18) అనే యువకుడు గల్లంతయ్యాడు. గూటి బిళ్ల కోసం దిగి గల్లంతైనట్లు తెలుస్తుంది. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. తహశీల్దార్ యడ్ల దుర్గ కిషోర్ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లతో యువకుడి కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Read More
తాజా వార్తలు

బ్రాడీపేట కులాయి గట్టు చెరువుకి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి పాలకొల్లు టౌన్ బ్రాడీపేట కొత్త కుళాయి చెరువులో కంచి ఏర్పాటు చేయాలని భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షుడు కాలవ వెంకటేశ్వర (కన్నా) విజ్ఞప్తి చేశారు. చెరువులో ఇటీవల 15 సంవత్సరాల కుర్రవాడు మరణించిన సంగతి తెలిసిందే. గతంలో ఒక వృద్ధురాలు కూడా ప్రమాదం గురించి హెచ్చరిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో, కంచి ఏర్పాటు చేయాలని కాపు సేవా సమితి కోరుతోంది.

Read More
తాజా వార్తలు

గుంటూరు సిటీకి అదిరిపోయే న్యూస్ చెప్పిన కేంద్రం..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కేంద్రం నుంచి వరుసగా శుభవార్తలు అందుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలోని నగరాల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన పలు సమస్యలకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పరిష్కారాలు చూపిస్తోంది. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు చూపిస్తున్న చొరవకు కేంద్రం సాయం కూడా తోడవడంతో గుంటూరుకు మరో గుడ్ న్యూస్ అందింది. అమరావతి రాజధానిలో కీలకమైన గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేసే పరిస్ధితి

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: డీఎస్సీ ఉచిత శిక్షణా తరగతులు

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే డీఎస్సీలో పాలకొల్లు నియోజకవర్గం పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు పొందేలా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులను ఆదివారం మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. ఈ శిక్షణలో 650 మందికి సబ్జెక్టుల వారీగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందే నిరుద్యోగ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు.

Read More
తాజా వార్తలు

దేశమంతా 76…యానాంలో మాత్రం 71వ గణతంత్ర వేడుక

దేశమంతా ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం జరగనుంది. కేంద్ర పాలితప్రాంతం యానాంలో మాత్రం 71వ గణతంత్ర దినోత్సవం కావడం గమనార్హం. దేశానికి 1947లో స్వాతంత్య్రం వస్తే ఫ్రెంచి ప్రభుత్వం పాలనలో ఉన్న యానాం, మిగిలిన మూడు ప్రాంతాలకు 1954 నవంబరు 1న విమోచనం లభించింది. అప్పటి ఫ్రెంచి కమిషనర్ ఎస్కరుయిల్ ఫ్రెంచి పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, కారైకాల్, మాహే, యానాంలకు తగిన ప్రాధాన్యం, రక్షణ కల్పించాలని ప్రధాని నెహ్రూతో ఒడంబడిక చేసుకుని భారతదేశం నుంచి వైదొలిగారు. 1956లో

Read More
తాజా వార్తలు

అవార్డు గ్రహీతకు శుభాకాంక్షలు

ఉత్తమ సేవలకు గుర్తింపు – రిపబ్లిక్ డే అవార్డు* సమాజంలో నిర్విరామంగా వివిధ సేవా కార్యక్రమాల్లో.. తమదైన శైలిలో ఎందరో నిరుపేదలకు సహాయ సహకారములు అందింస్తూ.. నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ప. గో. జిల్లా కలెక్టర్ నాగరాణి గారి చేతుల మీదగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డును స్వీకరించినLn. కొమ్ముల మురళీకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు🌹

Read More
తాజా వార్తలు భక్తి

Republic Day 2025: కర్తవ్యపథ్‌లో ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

76 గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిపబ్లిక్‌ డే వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు..

Read More
తాజా వార్తలు

సరికొత్త లుక్‌లో మైమరిపిస్తున్న స్రవంతి చొక్కారపు.

టెంప్ట్ అందాలతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించేస్తుంది స్రవంతి చొక్కారపు. రోజు రోజుకు డోస్ మరింత పెంచేస్తూ.. తన అందాల విందుతో కుర్రకారులో హీటెక్కించేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. పుష్ప సినిమా విడుదల సమయంలో స్రవంతి చిత్ర యూనిట్‌తో చేసిన ఇంటరాక్షన్ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. అల్లు అర్జున్ మరియు సుకుమార్ ఆమె రాయలసీమ యాసకు ఫిదా అయ్యారు.

Read More