June 8, 2025

తాజా వార్తలు

తాజా వార్తలు

పాఠశాల బస్సు బోల్తా.. 13 మందికి గాయాలు

AP: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాండ్రేగులలో ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీ స్వామి వివేకానంద స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది పిల్లలకు గాయాలయ్యాయి. వారిని జగ్గంపేట సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read More
తాజా వార్తలు

త్వరలో 900 అంగన్వాడీలు ప్రారంభం: మంత్రి

AP: మరో 2, 3 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 900 అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అంగన్వాడీల్లో తాగునీరు, టాయిలెట్ల కోసం రూ.7 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అలాగే గిరిజనుల కోసం 18 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. మరోవైపు మహిళల సాధికారత టీడీపీతోనే ప్రారంభమైందని వివరించారు.

Read More
తాజా వార్తలు

అమరావతిలో 13 సంస్థలకు షాక్- కేబినెట్ సబ్ కమిటీ సంచలనం..!

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయినా ఇంకా అమరావతిలో నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంపై విమర్శలు వస్తున్న వేళ సచివాలయంలో భూకేటాయింపులపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో గతంలో ఇక్కడ భూములు తీసుకున్న 13 సంస్థలకు షాకిచ్చింది. రాజ‌ధానిలో గ‌తంలో భూములు తీసుకున్న 13 సంస్థ‌ల‌కు వాటి కేటాయింపులు ర‌ద్దు చేస్తూ

Read More
తాజా వార్తలు

ప.గో. జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం -2025 సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో 7వ రోజు మహిళా సాధికారిత వారోత్సవాలను ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పోలీస్ అధికారులు మహిళలు, చిన్నారులకు అత్యవసర సమయంలో సహాయం కొరకు హెల్ప్‌లైన్ నెంబర్లు చైల్డ్ హెల్ప్ లైన్: 1098, ఉమెన్ హెల్ప్ లైన్: 181, పోలీస్ హెల్ప్ లైన్: 100, 112, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్: 1930, కాల్ చేయాలన్నారు.

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: ఈనెల 15 నుండి జాతీయస్థాయి నాటికల పోటీలు.

పాలకొల్లు కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 15, 16, 17 తేదీల్లో 16వ జాతీయ స్థాయి నాటికల పోటీలు జరుగనున్నాయి. ముఖ్య అతిథిగా రావాలని కోరుతూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని శనివారం పాలకొల్లు కళా పరిషత్ అధ్యక్షులు కె. వి. కృష్ణ వర్మ, మానపురం సత్యనారాయణ, జక్కంపూడి కుమార్, మేడికొండ శ్రీనివాస్ చౌదరి, కొల్లి కొండా ప్రసాద్, కొణిజేటి గుప్తా తదితరులు ఆహ్వానించారు.

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: జనసేన ఆవిర్భావ సభకు తరలిరావాలి

ఈనెల 14న పిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు పాలకొల్లు మండలం నుండి పెద్ద సంఖ్యలో వెల్లడానికి తీసుకోవలసిన ఏర్పాట్లపై శనివారం మండల నాయకుడు సాధనాల దుర్గబాబు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. జనసేన ఆవిర్భావ సభకు వేలాదిగా తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జిల్లా కార్యదర్శి బోనం చినబాబు, జిల్లా ప్రచార విభాగం కోఆర్డినేటర్ తులా రామలింగేశ్వరరావు పాల్గొన్నారు.

Read More
తాజా వార్తలు

నాడు ఇంగ్లీష్ వద్దు- నేడు హిందీ ముద్దు

Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల ఈ పర్యటన కోసం బుధవారమే హస్తినకు చేరుకున్నారాయన. కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి చర్చించారు. నితిన్ గడ్కరీతో భేటీ ముగిసిన తరువాత చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనాభా పెరుగుదల, ఎక్కువమంది పిల్లలను కనడంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు చంద్రబాబు. ఉత్తరప్రదేశ్, బీహార్‌లల్లో అధిక జనాభా ఉండటం సమస్యే కాదని, స్వాగతించదగ్గ విషయమని అన్నారు. అధిక జనాభాను

Read More
తాజా వార్తలు

ఎల్ఐసీకి షాక్: రెండు నెలల్లో రూ. 1.45 లక్షల కోట్ల సంపద ఆవిరి!

దేశ ప్రజల ఆర్థిక భద్రతకు భరోసాగా నిలిచే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కు ఈ ఏడాది ప్రారంభం ఊహించని విధంగా కష్టాలను తెచ్చిపెట్టింది. భారీ సంస్థాగత పెట్టుబడిదారుగా పేరుగాంచిన ఎల్ఐసీ, కేవలం రెండు నెలల్లోనే తన ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో రికార్డు స్థాయిలో నష్టపోయింది. 2025 జనవరి, ఫిబ్రవరి నెలల్లో స్టాక్ మార్కెట్ లో నెలకొన్న ఊహించని పరిస్థితుల కారణంగా ఏకంగా రూ. 1.45 లక్షల కోట్ల సంపదను కోల్పోయింది. గత ఏడాది డిసెంబర్

Read More
తాజా వార్తలు

నిరుద్యోగులకు అదిరిపోయే ఆఫర్.. నెలకు 5 వేలు ఇచ్చే కొత్త స్కీమ్ !

విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగులకు ఓ తీపి కబురు. ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉన్న వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు అదిరిపోయే ఆఫర్ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. నిరుద్యోగులకు సంబంధించి ఎన్నో పథకాలు ప్రస్తుతం అందుబాటులో ఉండగా.. రీసెంట్ గా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు సరికొత్త స్కీమును ఆవిష్కరించింది. అదే పీఎం ఇంటర్న్ షిప్ పథకం. ఈ స్కీమ్ తో ఎంతో మంది

Read More
తాజా వార్తలు

ఏపీలో నిరుద్యోగులకు సర్కార్ అదిరిపోయే న్యూస్..!

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కూటమి సర్కార్ అదిరిపోయే వార్త చెప్పింది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక, వయస్సు మీరిపోతున్న వారికి ఊరట కల్పిస్తూ కూటమి సర్కార్ ఇవాళ కీలక ప్రకటన చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రెండు కేటగిరీల్లో ఇలా వయో పరిమితిని పెంచారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న యూనిఫామ్, నాన్-యూనిఫామ్ కేటగిరీ ఉద్యోగాలకు వయో

Read More