June 8, 2025
తాజా వార్తలు

ఎల్ఐసీకి షాక్: రెండు నెలల్లో రూ. 1.45 లక్షల కోట్ల సంపద ఆవిరి!

దేశ ప్రజల ఆర్థిక భద్రతకు భరోసాగా నిలిచే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కు ఈ ఏడాది ప్రారంభం ఊహించని విధంగా కష్టాలను తెచ్చిపెట్టింది. భారీ సంస్థాగత పెట్టుబడిదారుగా పేరుగాంచిన ఎల్ఐసీ, కేవలం రెండు నెలల్లోనే తన ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో రికార్డు స్థాయిలో నష్టపోయింది. 2025 జనవరి, ఫిబ్రవరి నెలల్లో స్టాక్ మార్కెట్ లో నెలకొన్న ఊహించని పరిస్థితుల కారణంగా ఏకంగా రూ. 1.45 లక్షల కోట్ల సంపదను కోల్పోయింది.

గత ఏడాది డిసెంబర్ నాటికి ఎల్ఐసీ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో విలువ అక్షరాలా రూ. 14.9 లక్షల కోట్లు. కానీ ఫిబ్రవరి నెల ముగిసేసరికి ఆ మొత్తం కాస్తా రూ. 13.4 లక్షలకు పడిపోయింది. అంటే కళ్ల ముందే లక్షల కోట్లు కరిగిపోయాయన్నమాట. ఎల్ఐసీ తన పెట్టుబడుల్లో ఇంతటి భారీ పతనాన్ని చూడటం చాలా అరుదు అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దాదాపు 310 కంపెనీలలో పెట్టుబడులు కలిగిన ఎల్ఐసీ పోర్ట్‌ఫోలియో ఇంత దారుణంగా పడిపోవడం గతంలో ఎన్నడూ జరగలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మార్కెట్ పతనం… ఎల్ఐసీకి దెబ్బ: ఎల్ఐసీ పెట్టుబడులు ఇలా ఒక్కసారిగా పతనమవ్వడానికి ప్రధాన కారణం దేశీయ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలడమే. మార్కెట్లో అనిశ్చితి నెలకొనడంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లు అయితే కోలుకోలేని విధంగా పడిపోయాయి. ఎల్ఐసీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన బడా కంపెనీల షేర్లు కూడా భారీగా నష్టపోయాయి. ఏ కంపెనీలు దెబ్బతీశాయి?: ఎల్ఐసీ పోర్ట్‌ఫోలియోలో రెండో అతిపెద్ద పెట్టుబడి అయిన ఐటీసీ షేర్లు ఏకంగా 18 శాతం పతనమయ్యాయి. దీంతో ఎల్ఐసీకి దాదాపు రూ. 17 వేల కోట్ల నష్టం వాటిల్లింది. టెక్నాలజీ రంగంలో దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ కూడా ఎల్ఐసీని నిరాశపరిచాయి. ఈ రెండు కంపెనీల్లో ఎల్ఐసీకి భారీగా వాటాలు ఉండగా, షేర్లు పడిపోవడంతో మరో రూ. 18 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video