June 8, 2025
భక్తి

ఈ నెల 5 నుంచి ఒంటిమిట్ట ఆలయంలో

Tirumala: కడప జిల్లా ఒంటిమిట్టలో గల చారిత్రాత్మక శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో ఈ నెల 5వ తేదీన మహా సంప్రోక్షణ ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఒంటిమిట్ట ఆలయంలో జరుగుతున్న జీర్ణోదరణ పనులు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇటీవలే టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు స్వయంగా పరిశీలించారు. గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం గత ఏడాది సెప్టెంబరు 6 నుండి 8వ తేదీ వరకు బాలాలయం జరిగిన విషయం తెలిసిందే.

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆలయంలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ పనులను పూర్తి కావచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5:30 గంట‌ల‌కు మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టనుంది టీటీడీ. విష్వక్సేనులవారి ఆరాధన, పుణ్యహవచనం, వాస్తు హోమంతో ఈ పనులకు అంకురార్పణం చేయనున్నారు టీటీడీ అర్చకులు. మాహా సంప్రోక్షణ సందర్భంగా 6వ తేదీ ఉదయం 7:30 గంట‌ల‌కు భ‌గ‌వ‌త్ పుణ్యాహ‌ం, అగ్ని మ‌థనం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, మహా కుంభ, ఉపకుంభ, చక్రబ్జా మండల, పరివార కుంభారాధనలు, ప్రధాన మూర్తి హోమాలు, శ్రీ మద్రామాయణ హ‌వన ప్రారంభం, మన్మోహన శాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. సాయంత్రం 5:30 గంటలకు చతుస్థానార్చనం, స‌హ‌స్ర‌ కళాశాదివాసం, వేదాది పారాయణం, మూర్తి హోమం, పరివార హోమం, పూర్ణాహుతి శాత్తుమొర జరగనుంది. 7వ తేదీ ఉద‌యం 8 గంట‌ల‌కు సహస్ర కలశావాహన, రామతారక హోమం, శ్రీమద్రామాయణ హోమం, పవమాన పంచసూక్త హోమం, విమాన గోపురం ఛాయా స్న‌పనము, పూర్ణాహుతి నిర్వ‌హిస్తారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video