పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇవాళ జరిగిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ప్రతీకార దాడులు, చొరబాట్లు జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీరాన్ని అప్రమత్తం చేస్తున్నారు. తీర ప్రాంతాల నుంచి తీవ్రవాదులు చొరబడే అవకాశం ఉండటంతో నేవీ మెరైన్ పోలీసు స్టేషన్లను హైఅలర్ట్ చేస్తోంది. దీంతో పాటు తీర గ్రామాల్లోనూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
మరోవైపు కృష్ణాజిల్లా పరిధిలో 3 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో పాలకాయతిప్ప (కోడూరు మండలం), గిలకలదిండి (మచిలీపట్నం), ఒర్లగొందితిప్ప (కృత్తివెన్ను మండలం) మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 150 మంది సిబ్బంది ఉన్నారు. ప్రతి సముద్ర తీర గ్రామంలో మెరైన్ పోలీసులతో పాటు రెండు డ్రోన్ కెమెరాలతో పహారా కాస్తున్నాయి. అదే సమయంలో తీర గ్రామాల ప్రజలను మెరైన్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. మచిలీపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్ పరిథిలో ప్రస్తుతం మెరైన్ బోట్లు వినియోగంలో లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి కొత్త బోట్లను రప్పిస్తున్నారు.
Leave feedback about this