ఛాంపియన్స్ ట్రోఫీలో.. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ నేడు జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్నాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. జియో హాట్స్టార్లో మ్యాచ్ను ఉచితంగా వీక్షించొచ్చు. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్పై ఎప్పటిలానే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే టోర్నీని గెలుపుతో ఆరంభించిన భారత్ ఫుల్ జోష్ లో ఉంటే.. మరోవైపు సొంతగడ్డపై ఆరంభ మ్యాచ్లోనే న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది పాకిస్తాన్. పైగా భారీ తేడాతో ఓడటం వల్ల రన్రేట్పై కూడా తీవ్ర ప్రభావం పడింది. దాంతో భారత్తో మ్యాచ్ ఆ జట్టుకు డూ ఆర్ డై లాంటిది. ఓడితే పాకిస్తాన్ కు సెమీస్ ఆశలు గల్లంతు కానున్నాయి.
క్రీడలు
నేడు పాక్తో భారత్ ఢీ.. దాయాదుల పోరులో ఓల్డ్ రికార్డ్స్ ప్రకారం ఎవరిది పైచేయి ?
- by kadali Lavanya
- February 24, 2025
- 0 Comments
- Less than a minute
- 44 Views
- 3 months ago

Leave feedback about this