June 8, 2025
ఎడ్యుకేషన్ & కెరీర్ తాజా వార్తలు

JEE Mains 2025 : నేటి నుంచి జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 రిజిస్ట్రేషన్లు ప్రారంభం

JEE Main 2025 Registration for Session 2 : దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్‌/ బీఆర్క్‌ సీట్ల భర్తీకి సంబంధించిన జేఈఈ మెయిన్‌ (Joint Entrance Examination JEE Main) 2025 సెషన్‌ 2 పరీక్షలకు జనవరి 31 (శుక్రవారం) నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలు కానుంది. విద్యార్థులు ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకు ప్రతి రోజు రెండు షిఫ్టులలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.nic.in/ చూడొచ్చు. అలాగే రిజిస్ట్రేషన్‌కు డైరెక్ట్‌ లింక్‌ ఇదే.

ముగిసిన జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్షలు:

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్షలు జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో జరిగాయి. దేశవ్యాప్తంగా 5 రోజులు జరిగిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 పరీక్షల్లో చివరి రోజు రెండో విడత ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు విడతల్లో మొత్తం 10 ప్రశ్నపత్రాల్లో.. జనవరి 29న మధ్యాహ్నం జరిగిన పరీక్షే కష్టంగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. జనవరి 28న ఉదయం జరిగిన పరీక్ష కఠినమని అనుకున్నామని.. కానీ జనవరి 29న రెండో షిఫ్ట్‌ ప్రశ్నపత్రంలో మూడు సబ్జెక్టుల ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని తెలిపారు. ఈసారి ఎక్కడా ప్రశ్నల్లో తప్పులున్నట్లు తమ దృష్టికి రాలేదని.. సాంకేతిక సమస్యలు కూడా గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గాయని చెప్పారు. ఇక చివరి పరీక్షను జనవరి 30వ తేదీన బీఆర్క్, బీ ప్లానింగ్‌ సీట్ల కోసం పేపర్‌ 2 పరీక్ష నిర్వహించారు. మూడు నాలుగు రోజుల్లో ప్రాథమిక కీ విడుదల చేసే అవకాశం ఉంది. ప్రిలిమినరీ ఆన్సర్‌ కీపై వచ్చే అభ్యంతరాలను స్వీకరించి పర్సంటైల్‌ స్కోర్‌ను ఫిబ్రవరి 12న ఎన్‌టీఏ ప్రకటించనుంది.

అయితే.. జేఈఈ మెయిన్‌ రెండు విడతల్లో వచ్చిన ఉత్తమ స్కోర్‌ ఆధారంగా తుది ర్యాంకులు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన తొలి 2.50 లక్షల మందిని జేఈఈ ఆడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. మే 18వ తేదీన దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఉంటుంది. జేఈఈ మెయిన్‌ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, అడ్వాన్స్‌డ్‌ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు పొందొచ్చనే విషయం తెలిసిందే. కాగా.. జేఈఈ మెయిన్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న 31 ఎన్‌ఐటీల్లో బీఈ, బీటెక్‌ కోర్సుల్లో.. జేఈఈ అడ్వాన్స్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా మొత్తం 23 ఐఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు కేటాయిస్తారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video