Tirumala: తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. వేసవి రద్దీ గతం కంటే పెరుగుతుందనే అంచనాలతో సిఫారసు లేఖలను రద్దు చేసారు. అయితే, రద్దీ అంచనాకు తగినట్లుగా లేకపోవటంతో తిరిగి బ్రేక్ దర్శనం కోసం సిఫారసు లేఖలను పునరుద్ద రిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక.. బ్రేక్ దర్శనాల మార్పును ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న టీటీడీకి సానుకూల ఫలితాలు కనిపించాయి. సామాన్య భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. ఆ సమయాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు.తిరుమలలో రద్దీ సాధారణం ఉంది. వేసవి రద్దీ గతం కంటే తక్కువగా ఉంది. వారాంతంలో మాత్రం ఎక్కువగా ఉంటోంది. దీంతో.. మిగిలిన రోజుల్లో శ్రీవారి భక్తులకు సులభ దర్శనం అందు తోంది. ఈ ఏడాది వేసవి సెలవుల్లో భారీగా భక్తులు తరలివస్తారని అంచనా వేసిన టీటీడీ అందుకు తగినట్లుగా తగిన ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా వీఐపీ సిఫార్సు లేఖలు రద్దు చేయడంతో పాటు బ్రేక్ దర్శన వేళల మార్పు ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ప్రతీ ఏటా మే నెలలో కని పించే రద్దీకి భిన్నంగా ఈ సారి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నెలలో 14వ తేదీ వరకు దాదాపు 13 రోజుల్లో 6 రోజులు 70,000 మంది లోపే భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.కాగా, మూడు రోజులు 70,000 మంది పైన మిగిలిన 4 రోజులు మాత్రమే 80,000 మంది పైన భక్తుల రద్దీ కనిపించగా వీరికి 6 నుంచి 10 గంటల్లోపే సర్వదర్శనం పూర్తయింది. ఇక.. టీటీడీ బ్రేక్ దర్శన సమయాలను ఈ నెల మొదటి నుంచి అమలు చేస్తోంది. గురు, శుక్రవారాల్లో పాత వేళలే కొనసాగించి మిగిలిన రోజుల్లో ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు 10.30 నుంచి 12.30 గంటల వరకు శ్రీవారి బ్రేక్ దర్శనం అమలు చేస్తోంది. 8.30 నుంచి 10.30 గంటల మధ్యన సర్వదర్శనం భక్తులను అనుమతిస్తున్నారు. ఈ 2 గంటల్లో దాదాపు 7000 మందికి పైగా సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దీంతో 3-4 గంటల్లోనే దర్శనం పూర్తి చేసు కుంటున్నారు. వేసవి పూర్తయిన తరువాత ఈ విధానం కొనసాగింపు పైన టీటీడీ తుది నిర్ణయం తీసుకోనుంది.
TTD: శ్రీవారి భక్తులకు సులభ దర్శనం – ఆ సమయాల్లో మాత్రమే..!!
