పోడూరు మండలం జిన్నూరులో నిరుపేద కుటుంబానికి చెందిన వ్యవసాయ కూలీ, కౌరు అప్పారావు భార్య నాగమణి (45), ఇటీవల అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న మనకోసం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పడాల పెద్దిరాజు, సంఘ సభ్యులతో కలిసి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రూ. 3వేల ఆర్థిక సహాయాన్ని కుమారుడు కౌరు ఏసు కు అందజేసి మానవతా దృక్పధాన్ని చాటుకున్నారు. కె. నాగేశ్వరరావు, డి. దాసరి సత్యనారాయణ పాల్గొన్నారు.

Leave feedback about this