పాలకొల్లు పట్టణం నరసాపురం రోడ్డులో కొలువై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బాలసుబ్రమణ్య చైనులు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి వారికి పంచామృతాభిషేకాలు, పుష్పార్చన నిర్వహించారు. వేకువ జాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Leave feedback about this