అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రస్తుతం అస్సోంలోని గౌహతిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అక్కడి కామాఖ్య టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. స్నేహా రెడ్డి తన ఇన్ స్టా స్టోరీలో కామాఖ్య టెంపుల్ ఫోటోను షేర్ చేసింది. అక్కడే ఉన్నట్టుగా చెప్పేసింది. ఇంకా అస్సోంలోనే ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది. చూస్తుంటే కామాఖ్య టెంపుల్ ప్రభావం తెలుగు వారిపై ఎక్కువగా పడ్డట్టుగా కనిపిస్తోంది. ఈ మధ్య సెలెబ్రిటీలు ఎక్కువగా కామాఖ్య టెంపుల్కు వెళ్తున్నారు. వేణు స్వామి పుణ్యమా అని ఈ టెంపుల్కే మన సెలెబ్రిటీలు ఎక్కువగా క్యూ కడుతున్నారు.
Leave a Comment