ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. దావోస్ కేంద్రంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ద్వారా ప్రపంచ వేదికపై ఏపీలో పెట్టుబడుల కోసం పలు ప్రముఖ సంస్థలను ఆహ్వానించారు. ఆ తరువాత ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ప్రధానితోనూ కలిసే అవకాశం ఉంది. ఈ సమయంలో చంద్రబాబు కీలక ప్రతిపాదన చేసేందుకు సిద్దమయ్యారు. కేంద్ర బడ్జెట్ వేళ చంద్రబాబు ప్రతిపాదన ఏపీకి కీలక మలుపుగా మారనుంది.
దావోస్ పర్యటన ముగించుకున్న చంద్రబాబు నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవనున్నారు. దావోస్ వేదికగా పలువురు పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు సమావేశాలు నిర్వహించారు. ప్రభు త్వ పాలసీలు, అవకాశాలు, ఆలోచనలను వివరించి పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ సంస్థలకు ఆహ్వానం పలికారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. ప్రధానితోనూ కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్న 2024-25 వార్షిక బడ్జెట్ లో కేటాయింపుల కోసం చర్చలు చేయనున్నారు.