AP Mega DSC Notification 2025 : ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తాజాగా రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యదర్శుల సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. గత ఏడాది జూన్ నెలలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించినా ఎస్సీ వర్గీకరణ అంశంతో వాయిదా పడింది. అయితే.. మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి.. నియామక ప్రక్రియ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం (జూన్) నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేసే యోచనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఉన్నట్లు తెలుస్తోంది.
Chandrababu Naidu : మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్? సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన ఇదే!
