apollonews.in Blog తాజా వార్తలు అన్న క్యాంటీన్‌లో వారికి నో ఎంట్రీ
తాజా వార్తలు

అన్న క్యాంటీన్‌లో వారికి నో ఎంట్రీ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లలో కొత్త చిక్కు ఎదురవుతోంది.చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు. కడుపునిండా భోజనం చేయవచ్చు. పెద్ద పెద్ద హోటల్లో అందించేంత మెనూతో పరిశుభ్రతతో భోజనం వడ్డిస్తారు. కార్మికులు, కూలీలు, ఆటో డ్రైవర్లు, వీధుల్లో షాపులు నడిపేవారు ఇలా ఎంతో మందికి అన్నా క్యాంటిన్లు ఆకలి తీర్చుతున్నాయి.

కేవలం 5 రూపాయలకే రుచికరమైన భోజనం దొరకుతుండటంతో పెద్ద సంఖ్యలో పేదలు భోజనం చేసేందుకు అన్నా క్యాంటిన్ కు బారులు తీరుతున్నారు.ఇక్కడ భోజనం చేయడానికి అర్హత అక్కర్లేదు. రేషన్ కార్డు చూపించక్కర్లేదు. కడుపులో ఆకలి, చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు.. అన్న క్యాంటీన్లోకి అడుగుపెట్టొచ్చు.5 రూపాయలకే పరిశుభ్రమైన ఆహారం దొరుకుతూ ఉండటంతో పెద్ద సంఖ్యలో పేదలు వీటిని ఉపయోగించుకున్నారు. రూ.5కే భోజనం పెడుతుండటంతో కొంతమంది తాగుబోతులు కూడా ఇక్కడకు వచ్చి తోటివారితో, సిబ్బందితో గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఒంగోలులోని అన్న క్యాంటీన్‌ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Read more at: https://telugu.oneindia.com/news/andhra-pradesh/no-entry-into-anna-canteen-for-those-who-drink-alcohol-422393.html

Exit mobile version