apollonews.in Blog భక్తి తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసుల హారాన్ని కళ్లారా చూసే మహద్భాగ్యం..!!
భక్తి

తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసుల హారాన్ని కళ్లారా చూసే మహద్భాగ్యం..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు 59,776 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,386 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.24 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 30 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

Exit mobile version